హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలోని సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ (సీఐఈ)లో వైద్యరంగ నిపుణులకు పోస్ట్ డాక్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఓజాస్ మెడిటెక్ బయోనెస్ట్, బైరాక్ వంటి సంస్థలు వైద్య, ఆరోగ్యరంగంలో సరికొత్త ఆవిష్కరణలు చేసేందుకు ఆసక్తితో ఉన్న స్టార్టప్లకు సహాయ, సహకారాలను అందిస్తున్నాయి. అభ్యర్థులు cie.iiit.ac.in/ojas వెబ్సైట్ను సందర్శించి దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.