హైదరాబాద్ : చేనేత కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తానని తెలంగాణ మరమగ్గాల, జౌళి అభివృద్ధి కార్పొరేషన్ సంస్థ గూడూరి ప్రవీణ్ అన్నారు. రాష్ట్ర మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్రెడ్డి సమక్షంలో ఆయన మరమగ్గాల, జౌళి అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో మరమగ్గాలు, జౌళి పరిశ్రమల సమగ్రాభివృద్ధి కోసం జౌళీ రంగాల్లో ఆధారపడిన కార్మికులకు నిరంతరం పని కల్పించడంతో పాటు పవర్లూం వస్త్రాలకు మార్కెట్ సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కార్పొరేషన్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో చేనేత జౌళిశాఖ కార్యదర్శి బుద్ధ ప్రకాశ్ జ్యోతి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీలు ఎల్ రమణ, నారదాసు లక్ష్మణ్రావు, బసవరాజు సారయ్య, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావుతో పాటు రాజన్న సిరిసిల్లకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.