వ్యవసాయ యూనివర్సిటీ: శరవేగంగా పెరుగుతున్న జనాభాకు తిండిగింజలు అందాలంటే ఎప్పటికప్పుడు స్వల్పకాలిక వంగడాలను సృష్టించాల్సిన అవసరం ఉన్నదని, వాటికే భవిష్యత్లో ఆదరణ ఉండనున్నదని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి వీ ప్రవీణ్రావు అన్నారు. సోమవారం ఆన్లైన్లో నిర్వహించిన వర్సిటీ రాష్ట్రస్థాయి సాంకేతిక సదస్సులో ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ, తగ్గిపోతున్న సహజవనరులు, మారుతున్న ఆహారపు అలవాట్ల నేపథ్యంలో స్వల్పకాలిక వంగడాలు సృష్టించాలని చెప్పారు. వర్సిటీ విడుదల చేసిన వివిధ వంగడాలను అనేక రాష్ర్టాల్లో రైతాంగం సాగుచేస్తున్నదని గుర్తుచేశారు. కార్యక్రమంలో పరిశోధనా సంచాలకుడు ఆర్ జగదీశ్వర్, వరంగల్, నాగర్కర్నూల్, మహబూబ్నగర్, తాండూరుతోపాటు పలు పరిశోధనా కేంద్రాల నిపుణులు పాల్గొన్నారు.