స్ట్రింగ్స్ పేరుతో 33 ఏళ్ల పాటు అభిమానులను అలరించిన పాకిస్థాన్ పాప్, రాక్ జోడీ విడిపోయింది. ఇక స్ట్రింగ్స్ పేరుతో మ్యూజిక్ చేయబోవడం లేదని ప్రకటించింది. బిలాల్ మక్సూద్, ఫైజల్ కపాడియా ఈ స్ట్రింగ్స్ను క్రియేట్ చేశారు. తాము విడిపోతున్నట్లు తమ అధికారిక సోషల్ మీడియాలో వాళ్లు చెప్పారు. సాధారణ పోస్ట్ల కంటే ఇది కాస్త డిఫరెంట్. ఈ రోజుతో (25-03-21) స్ట్రింగ్స్ను ముగించాలని నిర్ణయించాము. గత 33 ఏళ్లూ మా ఇద్దరిదీ చాలా అద్భుతమైన ప్రయాణం. ఇన్నేళ్లపాటు ఇలా కలిసి మ్యూజిక్ చేయడం చాలా అరుదైన విషయం. దీనిని సాధ్యం చేసిన అభిమానులందరికీ కృతజ్ఞతలు. ఇద్దరం కలిసి మ్యూజిక్ చేయకపోయినా.. మాది విడదీయరాని బంధం అని మక్సూద్, ఫైజల్ జోడీ చెప్పింది. రెండు దశాబ్దాల కిందటే స్ట్రింగ్స్ క్రియేట్ చేసిన దూర్ అనే సాంగ్ సంచలనం సృష్టించింది. నదియా కే పార్, ధానీ, నజానే క్యూ, అంజానేలాంటి పాటలు హిట్ అయ్యాయి. స్ట్రింగ్స్ విడిపోయారన్న వార్తపై అభిమానులు విచారం వ్యక్తం చేశారు. స్ట్రింగ్స్ పోస్ట్పై వేల మంది కామెంట్స్ చేశారు. ఇది చాలా బాధ కలిగించే వార్త అని ఒకరు, ఇంకొక్క కాన్సర్ట్ చేయండి ప్లీజ్ అంటూ మరొకరు కామెంట్స్ చేశారు.