వరంగల్ రూరల్ : జిల్లాలోని రాయపర్తి, వర్ధన్నపేట, పర్వతగిరి మూడు మండలాల ప్రజలకు రాకపోకలు ఇక సులువు కానున్నాయి. రాయపర్తి మండలం కొత్తూరు రోడ్ నుంచి వర్ధన్నపేట మండలం ల్యాబర్తి క్రాస్, వయా రోళ్లకల్, కల్లెడ వరకు ఆకేరు వాగు మీదుగా 5.23 కి.మీ రోడ్డుతో పాటు ఆకేరువాగుపై బ్రిడ్జి నిర్మాణం చేయడానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు PMGSY పథకం కింద రూ.10.43 కోట్లు మంజూరు చేశారు.
ఈ నేపథ్యంలో ఆయన కొత్తూరు గ్రామంలోని ప్రతిపాదిత రోడ్డు, బ్రిడ్జి నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. రోడ్డు నిర్మాణానికి రూ.4.47 కోట్లు, బ్రిడ్జి నిర్మాణానికి రూ 5.96 కోట్ల అంచనాలతో పనులకు టెండర్లు పిలిచామని మంత్రి తెలిపారు. తొందరగా టెండర్లు ఖరారు చేసి పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
ఆకేరువాగుపై బ్రిడ్జి నిర్మాణంతో రాయపర్తి, వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల రైతుల వ్యవసాయ అవసరాలతోపాటు, వ్యాపార అవసరాలకు రవాణా సౌకర్యం మెరుగు పడుతుందని మంత్రి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఘనంగా హేమాచల లక్ష్మీ నర్సింహస్వామి నాగవెల్లి
పోలీసుల పేరుతో దోపిడీకి పాల్పడిన దొంగ అరెస్ట్
మహబూబాబాద్ ఘటనపై మంత్రి ఎర్రబెల్లి సీరియస్
కరోనా బాధితులను ప్రజా ప్రతినిధులు ఆదుకోవాలి