రాజన్న సిరిసిల్ల : సౌదీలో ఆత్మహత్య చేసుకున్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం చీర్లవంచకు చెందిన గంగు కనుకయ్య(40) మృతదేహం మంత్రి కేటీఆర్ చొరవ తీసుకోవడంతో గురువారం స్వగ్రామానికి చేరింది. మూడు నెలల క్రితం కనకయ్య సౌదీలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, కరోనా పరిస్థితులు ఉన్నా కనకయ్య మృతదేహం తెప్పించేందుకు మంత్రి కేటీఆర్ అక్కడి ఎంబసీ అధికారులతో మాట్లాడి ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
గురువారం శవపేటిక ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కనకయ్యకు భార్య మంజుల, ఇద్దరు కూతుళ్లు ఆదర్శ, మమతలు ఉన్నారు. కనకయ్య కొన్నేళ్లుగా ఉపాధి కోసం సౌదీ వెళ్తుండగా, రెండేళ్ల క్రితం స్వగ్రామానికి వచ్చి, తిరిగి వెళ్లాడు. నాలుగు నెలల క్రితం పెద్ద కూతురు ఆదర్శ వివాహం జరగగా, ఆర్థిక ఇబ్బందులు పెరగడం, అక్కడ ఉపాధి సరిగా లేకపోడంతో మనోవేదన చెంది ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇవి కూడా చదవండి..
పల్లె ప్రగతిలో అందరు భాగస్వాములు కావాలి
జాతీయ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటాలి
రాగల మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు
టీఆర్ఎస్ను వీడే ప్రసక్తే లేదు : ఎంపీ బీబీ పాటిల్
అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
సింగరేణి నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి