ముంబై: మహారాష్ట్రకు సరఫరా చేసే రెమ్డెసివిర్, ఆక్సిజన్ కోటాను కేంద్ర ప్రభుత్వం తగ్గించిందని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆరోపించారు. రెమ్డెసివిర్ కోటాను 36,000 ఇంజెక్షన్ల నుండి 25 వేల ఇంజెక్షన్లకు తగ్గించారని విమర్శించారు. ఇప్పటి వరకు 240 నుంచి 250 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మహారాష్ట్రకు సరఫరా అయ్యేదని, అయితే ఇప్పుడు 125 మెట్రిక్ టన్నులకు తగ్గించినట్లు తమకు సమాచారం అందిందని అన్నారు.
రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో జామ్నగర్ నుంచి 250 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను తగ్గించవద్దని కేంద్రాన్ని అభ్యర్థిస్తున్నామని అజిత్ పవార్ తెలిపారు. ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు మూసివేసిన ఆక్సిజన్ ప్లాంట్స్ను పునరిద్ధరించినట్లు వెల్లడించారు.