హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్కు మరో అరుదైన గౌరవం లభించింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికలు, దేశాల నుంచి ఆహ్వానం అందుకున్న మంత్రి కేటీఆర్కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం దక్కింది. ఈ నెల 29న ఫ్రెంచ్ సెనేట్లో జరిగే అంబీషన్ ఇండియా -2021 సదస్సులో ప్రసంగించాలని కేటీఆర్కు ఫ్రెంచ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
ఫ్రెంచ్ ప్రధానమంత్రి ఇమ్మాన్యూల్ మాక్రోన్ సారథ్యంలో నిర్వహించే ఈ సదస్సు భారత్ – ఫ్రెంచ్ దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతానికి దోహదం చేస్తుందని కేటీఆర్కు పంపిన లేఖలో ఫ్రెంచ్ ప్రభుత్వం పేర్కొన్నది. అంబీషన్ ఇండియా 2021 సదస్సులో కీనోట్ స్పీకర్గా గ్రోత్ – డ్రాఫ్టింగ్ ఫ్యూచర్ ఆఫ్ ఇండో ఫ్రెంచ్ రిలేషన్స్ ఇన్ పోస్ట్ కోవిడ్ ఎరా(era) అనే అంశం పైన తన అభిప్రాయాలు పంచుకోవాలని మంత్రి కేటీఆర్ను ఫ్రెంచ్ ప్రభుత్వం కోరింది.
గతంలో నిర్వహించిన అంబీషన్ ఇండియా సదస్సులో సుమారు 700 మంది వ్యాపార, వాణిజ్య భాగస్వాములు, 400కు పైగా ఇరు దేశాల కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారని తెలిపింది. ఇప్పుడు కూడా అంతకుమించి కంపెనీల భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నామని, ఇలాంటి కీలకమైన వేదిక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యాపార వాణిజ్య అవకాశాలను పరిచయం చేసేందుకు ఉపయుక్తంగా ఉంటుందని ఫ్రెంచ్ ప్రభుత్వం తెలిపింది. ముఖ్యంగా ఈ సదస్సులో హెల్త్ కేర్, క్లైమేట్ చేంజ్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఆగ్రో బిజినెస్ వంటి ప్రధానమైన అంశాలపైన చర్చించనున్నట్లు చెప్పింది. దీంతో పాటు ఫ్రెంచ్, భారత కంపెనీల మధ్య ద్వైపాక్షిక సమావేశాలు ఉంటాయని తెలిపింది.
ఫ్రెంచ్ దేశ ఆహ్వానం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సదస్సు ద్వారా తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలను పరిచయం చేసే అవకాశం కలుగుతుందన్నారు. ఫ్రెంచ్ దేశపు ఆహ్వానం తెలంగాణ ప్రభుత్వ విధానాలకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నానని మంత్రి కేటీఆర్ అన్నారు.