హైదరాబాద్ : రాష్ట్రంలో కొవిడ్ సోకిన వైద్యులకు నిమ్స్లో చికిత్స అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిమ్స్ డైరెక్టర్ కార్యాలయం నుంచి సూపరింటెండెంట్కు ఆదేశాలు జారీ అయ్యాయి. వైద్యులను చేర్చుకునేందుకు ఆర్ఎంను నియమించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొవిడ్ బారినపడిన వైద్యులకు నిమ్స్లో ఉచితంగా చికిత్స అందించాలన్న జూనియర్ డాక్టర్ల డిమాండ్ దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సర్కారు నిర్ణయంపై వైద్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.