హైదరాబాద్: సైబరాబాద్ పోలీసులు- సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తంగా ప్రజల కోసం వినూత్న సేవలను అందుబాటులోకి తెచ్చారు. కరోనా నివారణ కోసం అవసరమయ్యే సూచనలు, సలహాలు అందించేలా కాల్సెంటర్ ఏర్పాటైంది. ఈ కాల్ సెంటర్లో 20 మంది పేరొందిన దవాఖానల వైద్యులు అందుబాటులో ఉంటారు. కొవిడ్కు కారణమయ్యే అంశాలు, నివారణ, వ్యాక్సినేషన్ ఇతర వైద్యానికి సంబంధించిన విషయాలపై 8045811138 నంబరుకు ఫోన్ చేసి సలహాలు పొందవచ్చని సైబరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. ప్రతిరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 7 గంటల వరకు సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. వైద్యుల సంఖ్య పెరిగితే ఈ సేవలు 24/7 అందుబాటులోకి రానున్నాయి. కాగా, దవాఖానలో బెడ్లు, అక్సిజన్ సిలిండర్ల గురించి మాత్రం ఈ నంబరుకు ఫోన్ చేయొద్దని సీపీ విజ్ఞప్తి చేశారు. ఈ డా.రాజీవ్ మేనన్ సారథ్యంలో ఈ కాల్సెంటర్ నడుస్తున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..