కోట్లు నిధులతో పట్టణ సుందరీకరణ
పరిశ్రమలు..ఉపాధి సోపానాలు
పెరిగిన వ్యాపారాలు, అద్దె ఇండకు కిరాయిలు
నియోజకవర్గ కేంద్రానికి మారిన రూపురేఖలు
జడ్చర్ల టౌన్, మార్చి 29 : ఉమ్మడి జిల్లాకు ఏ ప్రాంతానికెళ్లాలన్న జడ్చర్ల నుంచి వెళ్లాల్సిందే. జిల్లాకు కేంద్రంమైన జడ్చర్ల నియోజకవర్గ కేంద్రం అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి దిశ లో పయనిస్తున్నది. ప్రధానంగా 44వ, 167వ జాతీయ రహదారులు ఉండడంతో రోడ్డు, రైలు మార్గంలో వెళ్లాలన్న జడ్చర్ల నుంచి ప్రయాణించాల్సిందే. జిల్లా కు నడిబొడ్డున్న జడ్చర్ల పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధికి నోచుకుంటున్నది. ప్రధానంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జడ్చర్ల నియోజకవర్గ కేం ద్రానికి రూపురేఖలు మారిపోయాయి. జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి రూ.కోట్లాది నిధులను తీసుకొచ్చి జడ్చర్లలో విస్తృతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ప్రధానంగా పట్టణ ప్రధాన రహదారుల విస్తరణ, పార్కులు, ట్యాంక్బండ్ల నిర్మాణం, అంతర్గత రహదారుల నిర్మాణం, డ్రై నేజీల నిర్మాణాలు, వందపడకల దవాఖాన నిర్మాణ పనులు, తదితర అభివృద్ధి పనులను చేపడుతున్నారు. ఇప్పటికే జడ్చర్ల మున్సిపాలిటీలో దాదాపు రూ.40 కోట్లు నిధుల వ్యయంతో అ భివృద్ధి పనులు జరుగుతున్నాయి. దాదాపు 70 వేలకు పైగా జ నాభాకు అనుగుణంగా పట్టణంలో మౌలిక సదుపాయాలు క ల్పించేందుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కృషి చేస్తున్నారు. గతంలో ఎ న్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు చేపడుతుండడంతో పట్టణం నలుమూలాల దాదాపు 3 కి.మి పొడవునా విస్తరించింది. మరోవైపు మండలంలోని పోలేపల్లి సెజ్లో ఫార్మా, ఇతరాత్ర పరిశ్రమల ఏర్పాటుతో జడ్చర్లకు అభివృద్ధికి మరింత దోహదపడింది. ఉమ్మడి జిల్లాతో పాటు ఇతర రాష్ర్టాలకు చెందిన నిరుద్యోగులు సెజ్ పరిశ్రమల్లో ఉపాధి కోసం వస్తున్నారు. అంతేకాకుండా విద్య, వ్యాపారం,వాణిజ్యపరంగా, వివిధ ఉపాధి అవసరాల నిమిత్తం ఇతర ప్రాంతాలకు చెందిన వారు జడ్చర్లలో స్థి రనివాసం ఏర్పరచుకుంటున్నారు. తద్వారా అద్దె ఇండ్లకు చాలా డిమాండ్ ఏర్పడింది. ఒక్కొ సింగిల్ బెడ్రూం ఇంటికి నెలకు అద్దె రూ.5 వేల నుం చి రూ. 7 వేలు, డబుల్ బెడ్రూం ఇంటికి అద్దె నెలకు రూ. 10వేలు నుం చి రూ. 15 వేలు వరకు కిరాయిలు పెరిగాయి. అద్దెలు పెరుగడంతో ఇండ్ల యాజమానులు పెద్ద పెద్ద భవనాలు, అపార్ట్మెంట్ల నిర్మాణాలపై దృష్టిసారించారు. మరోవైపు రియల్ ఎస్టెట్ వ్యాపారానికి రెక్కలొచ్చాయి. పట్టణంలో ఒక్కొ ప్లాటు ధర చదరపు గజానికి కనీసం రూ. 6 వేలు నుంచి రూ.15 వేలు ఉండ గా, ప్రధాన రహదారులపై గజానికి రూ.70 వేలకు పలుకుతున్నది. ఎకరం భూమి రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్లు ధర పలుకుతున్నది.
పెరిగిన ఇతర వ్యాపారాలు
జడ్చర్ల నియోజకవర్గ కేంద్రం అభివృద్ధికి పోలేపల్లి సెజ్లో పరిశ్రమల ఏర్పాటు ప్రధాన కారణం. ఇప్పటికే సెజ్లో హెటిరో, అరవిందో లాంటి పెద్ద ఫార్మా కంపెనీలతోపాటు మరికొన్ని ఫార్మా కంపెనీలు, ఇతర కంపెనీలు ఏర్పాటు కావడంతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ర్టాల నుంచి కార్మికులు, ఉద్యోగులు ఉపాధి నిమిత్తం ఇక్కడొచ్చి జడ్చర్లలో స్థిరపడుతున్నారు. తద్వారా హోటళ్లు, వస్త్ర దుకాణాలు, సూపర్మార్ట్లు, కిరాణ దుకాణాలు, ఫర్నీచర్, ఎలక్ట్రానిక్, ఇతరాత్ర వ్యాపారాలు పెరిగాయి. టీషాపులు, టీఫిన్ సెంటర్లు, ఇతరాత్ర చిరువ్యాపారులకు సైతం గిరాకీ పెరిగింది. అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల అడ్మిషన్లు పెరిగాయి. ప్రైవేట్ దవాఖానలు, మెడికల్ షాపుల గిరాకీ కూడా పెరిగింది.