అధికారులకు మంత్రి సబిత ఆదేశాలు
హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ ) : పదోతరగతి వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి చదువుతున్న 2.20 లక్షల మంది విద్యార్థులకు ఈ స్టడీ మెటీరియల్ను అందజేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు.