మంత్రి గంగుల.. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో ప్రారంభం
కొత్తపల్లి, జూన్ 5: కరోనా కష్టకాలంలో పేదల ఆకలి తీర్చడానికే రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెల్లకార్డు ఉన్న కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి 15 కిలోల చొప్పున బియ్యం అందజేయనున్నట్టు పేర్కొన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలోని ఓ రేషన్షాపులో గంగుల ఉచిత బియ్యం పంపిణీని ప్రారంభించి మాట్లాడా రు. రాష్ట్రంలో 53.56లక్షల కార్డులకు రెండు నెలల కోసం కేంద్రం ఉచితంగా అందించే పది కిలోల బియ్యంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం 5 కిలోలను కార్డుదారులకు ఉచితంగా అందజేస్తున్నదని చెప్పారు. సుమారు 2.80కోట్ల మందికి 4.31లక్షల టన్నుల బియ్యాన్ని సరఫరా చేయనున్నట్టు తెలిపారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం సుమారు రూ.92 కోట్లను ఖర్చు చేస్తున్నదని చెప్పారు. ఈ నెల 20వరకు బియ్యం పంపిణీ కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.