హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ)ః రాష్ట్రంలో మరో 80 వేల మంది ప్రైవేట్ టీచర్లు, సిబ్బందికి కరోనా ఆర్థిక సహాయాన్ని అందించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.20 లక్షల మంది ప్రైవేట్ టీచర్లు, సిబ్బందికి నెలకు రూ.2 వేలు, 25 కిలోల బియ్యాన్ని ఇప్పటికే పంపిణీ చేస్తున్నారు. మిగిలిన మరో 80 వేల మందికి కూడా ఇదే సహాయాన్ని ఇవ్వాలని ఆదివారం సీఎం కేసీఆర్ నిర్ణయించారు. మరోవైపు రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డుదారులందరికీ ఒక్కొ క్కరికి ఉచితంగా ఐదు కిలోల బియ్యం రెండు నెలలపాటు అందజేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
కరోనా కారణంగా స్కూళ్లు మూతపడటంతో వేతనాలు లేకుండా ఇబ్బందులకు గురవుతున్న ప్రైవేట్ టీచర్లు, సిబ్బందికి నెలకు రూ.2 వేలు, 25 కిలోల బియ్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించడం పట్ల రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. అదనంగా మిగిలిన మరో 80 వేల మంది టీచర్లకు ఇవ్వాలని నిర్ణయించడం సీఎం కేసీఆర్ దయాద్ర హృదయానికి నిదర్శనమన్నారు. సీఎం కేసీఆర్ మనసున్న మనిషి అని కొనియాడారు. సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో ఏ ఒక్కరు కూడ తిండికి ఇబ్బంది పడకూడదని ప్రైవేట్ టీచర్లు, సిబ్బంది అందరికి నెలకు రూ. 2 వేలు, 25 కిలోల బియ్యం ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం అద్భుతమన్నారు. ఈ నిర్ణయం పట్ల ప్రైవేట్ టీచర్ల తరపున సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాన పల్లా పేర్కొన్నారు.