ఖమ్మం : కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సుమారు 20 రోజుల కిత్రం ఖమ్మంలోని వ్యవసాయ మార్కెట్ మూతపడింది. ఆ తర్వాత లాక్డౌన్ సైతం అమలులోకి వచ్చింది. తిరిగి సోమవారం మార్కెట్లో క్రయ విక్రయాలు మొదలు కాగా తొలిరోజు ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల వెయ్యిమందికిపై రైతులు మార్కెట్కు సరుకు తీసుకువచ్చారు.
వారందరికీ ఖమ్మం మార్కెట్ కమిటీ ‘అన్నపూర్ణ’ పథకంలో భాగంగా ఉచింతగా ఆహారం అందజేసింది. సాధారణంగా నగర కార్పొరేషన్ గతంలో ఒక్కొక్కరి నుంచి రూ.5 చొప్పున వసూలు చేయగా ఈ సారి దాతల చొరవతో ఉచితంగా అందజేస్తున్నారు.
ముందుగా సమస్యను మంత్రి అజయ్కుమార్ దృష్టికి తీసుకువెళ్లగా వర్తక సంఘం సభ్యులు, నగరపాలక వర్గ సభ్యులు రైతులకు ఉచితంగా భోజనం అందజేసేందుకు ముందుకు వచ్చారు.
దీంతో రైతుల ఆకలి తీరింది. ఈ పథకాన్ని మార్కెట్లో క్రయవిక్రయాలు జరిగిన ప్రతిరోజూ అమలు చేస్తామని మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ప్రమాదం చేసి పరారవుతున్న డ్రైవర్.. పట్టుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్
సూర్యాపేట ప్రభుత్వ దవాఖానలో వైద్య సేవలు భేష్ : ఉత్తమ్ కుమార్ రెడ్డి
అత్తను కర్రతో కొట్టి చంపిన అల్లుడు
ఈ పాస్ ఉంటేనే అనుమతి : డీఐజీ రంగనాధ్
రూ.22 కోట్ల ఫండ్ రేజ్ చేసిన ప్రియాంక-నిక్ దంపతులు
బస్తీ దవాఖానను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్