జగిత్యాల : జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 36 మంది నిరుపేదలకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించారు. నేత్ర సమస్యలతో బాధపడుతున్న 36 మందికి జగిత్యాల పట్టణలోని పావని కంటి ఆస్పత్రిలో శస్త్ర చికిత్సలు చేయించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పంబాల రాంకుమార్, నాయకులు సమిండ్ల శ్రీనివాస్, ఆసుపత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.