సిద్దిపేట : రజకుల లాండ్రీ షాపులు, దోబీ ఘాట్లు, నాయీబ్రాహ్మణుల సెలూన్లకు ఉచిత విద్యుత్ను అందించే స్కీం వరం లాంటిదని మంత్రి హరీశ్ రావు తెలిపారు. మంగళవారం (idoc) మీటింగ్ హాల్లో నాయీ బ్రాహ్మణులు, రజకులకు ఉచిత విద్యుత్ పథకంపై జిల్లా కలెక్టర్, బీసీ సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు.
సెలూన్లకు ఉచిత విద్యుత్ కోసం నాయీ బ్రాహ్మణులు 547 దరఖాస్తులు, దోబీ ఘాట్, లాండ్రీలకు ఉచిత విద్యుత్ కోసం రజకులు 280 దరఖాస్తులు ఇప్పటి వరకు సమర్పించారరి జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సరోజ మంత్రి దృష్టి కి తీసుకువచ్చారు.
ఇంకా దరఖాస్తుల సమర్పణకు తుది గడువును ప్రభుత్వం నిర్ధారించలేదని ఆమె తెలిపారు.
జిల్లాలోని రజక, నాయీబ్రాహ్మణ కమ్యూనిటీలలోని
అర్హులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా చైతన్యం చేస్తున్నామని ఆమె మంత్రికి తెలిపారు.
వచ్చిన దరఖాస్తు దారుల వివరాలు పేర్కొంటూ జిల్లా కలెక్టర్ ద్వారా ఎలక్ట్రిసిటీ ఎస్ఈకి లేఖ రాయాలని మంత్రి ఆదేశించారు.
నాయీ బ్రాహ్మణులు, రజకులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే చెల్లించ నున్నందున వారికి కరెంట్ కట్ చేయవద్దని లేఖలో స్పష్టం చేయాలన్నారు.
ఈ సందర్శంగా మాట్లాడుతూ..
నాయీ బ్రాహ్మణులు, రజకులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వారి సౌకర్యార్థం మున్సిపల్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ నిబంధన ను మినహాయించిoదన్నారు. షాప్ తో పాటు ఇంటి వద్ద పని చేసే రజ కులు, నాయీబ్రాహ్మణుల కు కూడ ఈ స్కీం వర్తింప చేసిందని మంత్రి పేర్కొన్నారు.
రజకుల లాండ్రీ షాపులు, నాయీబ్రాహ్మణుల సెలూన్లకు ఉచిత విద్యుత్తును అందించే స్కీమ్ కింద లబ్ధిదారుల సంఖ్యను పెంచడానికి స్థానిక ప్రజాప్రతినిధులు సహకారంతో జిల్లాలో బీసీ సంక్షేమ శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని మంత్రి సూచించారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ ఉచిత విద్యుత్ నిర్ణయం ద్వారా వృత్తి దారులకు శారీరక శ్రమ తగ్గి, ఆర్థిక వెసులు బాటు కూడా కలగనుందన్నారు.
ఇప్పటికి దరఖాస్తు చేసుకొని
లబ్ధిదారులు తమ వివరాలను మీసేవా కేంద్రాల్లో వెంటనే నమోదు చేసుకోవాలనీ మంత్రి పిలుపు నిచ్చారు.
ఇవి కూడా చదవండి..
దారుణం : ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఆ పై తాను తాగి..
రామప్పను సందర్శించిన మంత్రులు, పురావస్తు శాఖ అధికారులు
జడ్చర్లలో భారీగా గుట్కా పట్టివేత
మహబూబాబాద్ జిల్లాలో 120 క్వింటాళ్ల నల్ల బెల్లం పట్టివేత