వరంగల్ అర్బన్ : కరోనా కష్టకాలంలో సిబ్బందికి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి లు స్పష్టం చేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో పారిశుధ్య సిబ్బంది, వలస కూలీలు, అనాథలు, ఫీవర్ సర్వే నిర్వహిస్తున్న ఆశ వర్కర్లు, ఏ.ఎన్.ఏం.ల కోసం బల్దియా పరిధిలో 9 ఉచిత భోజన కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఖాజీపేట రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఉచిత భోజన కార్యక్రమాన్ని చీఫ్ విప్, మేయర్ సంయుక్తంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వం లాక్ డౌన్ నిర్ణయం తీసుకుందన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందజేయాలని రెమిడెసివిర్ ఇంజక్షన్లతో పాటు ఆక్సిజన్, వెంటిలేటర్ లను కూడా అందుబాటులో ఉంచామన్నారు.
నగరంలోని అన్ని ,ప్రైవేట్ దవాఖానలు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మందులను విక్రయించాలన్నారు. కరోనా బారి నుంచి కాపాడే సందర్భంలో అనేక నగరాల్లో పేద ప్రజలు ఆకలితో అలమటించకూడదని ఉచిత భోజన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నగర వ్యాప్తంగా 9 కేంద్రాల్లో ప్రతి రోజు సుమారు 10 వేల మందికి ఉచిత భోజన సదుపాయం కల్పించడం హర్షణీయం అన్నారు.
కార్యక్రమంలో ఇంచార్జి కమిషనర్ సత్యనారాయణ, కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్, విజయ శ్రీ రాజాలి, సంకు నర్సింగ్ తో పాటు డీఈ నరేందర్, శానిటరీ సూపర్ వైజర్ నరేందర్, శానిటరీ ఇన్స్పెక్టర్లు కరుణాకర్, రవీందర్, యాదయ్య, ఏఈ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
పారాణి ఆరకముందే తనువు చాలించిన వధువు
మానవత్వం చాటిన ముస్లిం యువకులు..
పేదరికంతో రోడ్డున పడ్డ కుటుంబం..ఆదుకున్న మంత్రి సత్యవతి
విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు : మంత్రి పువ్వాడ
కరోనా కట్టడిలో ఎన్నారైలు భాగస్వాములు కావాలి
కరోనా లక్షణాలు ఉన్న అందరికి మందులు ఇవ్వండి