హైదరాబాద్ : దివంగత బిగాల కృష్ణమూర్తి జ్ఞాపకార్థం కరోనా బాధితులు, వారి సహాయకుల కోసం నిర్వహిస్తున్న ఉచిత భోజన తయారీ కేంద్రాన్ని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల, టీఆర్ఎస్ ఎన్నారై సెల్ కో -ఆర్డినేటర్ మహేష్ బిగాల సందర్శించారు. అనంతరం హమాల్ వాడి చౌరస్తాలో కరోనా బాధితులు, వారి సహాయకులకి భోజనం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మహేష్ బిగాల మాట్లాడుతూ..కరోనా రెండో దశ విజృంభిస్తున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో హోమ్ ఐసోలేషన్ లో ఉన్న కరోనా బాధితులు, వారి సహాయకులు, నిజామాబాద్ నగరంలో వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్న బాధితులు, వారి సహాయకులు భోజనం దొరకకుండా ఇబ్బంది పడకూడదని వారి కోసం మా తండ్రి జ్ఞాపకార్థం గత 35 రోజులుగా ఉచితంగా భోజనం వితరణ చేస్తున్నామని తెలిపారు.
అన్నదాన కార్యక్రమానికి దివంగత మా తండ్రిగారే స్ఫూర్తి అని పేర్కొన్నారు. అలాగే కరోనా వృద్ధి చెందకుండా కరోనా నివారణ చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నది. ప్రభుత్వ చర్యలకు మద్దతుగా ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి వ్యక్తి గతంగా సహాయం చేయాలని స్థానిక ఎమ్మెల్యే గణేష్ బిగాల ముందుకు వచ్చారని తెలిపారు.
ఉచిత భోజన వితరణ కార్యక్రమంలో పాల్గొంటున్న కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్స్ ధన్యవాదాలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
చిన్నారి గుండెకు అండగా ఎమ్మెల్యే మర్రి
ప్రజా సేవలో పోలీసులు అంకితం కావాలి
మెడికల్ హబ్గా మహబూబాబాద్ : మంత్రి సత్యవతి
వరద నీటిని సద్వినియోగం చేసుకోవాలి
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి : మంత్రి పువ్వాడ