న్యూఢిల్లీ : బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్కి కేంద్రం భద్రత పెంచింది. ప్రస్తుతం ఆయనకు ‘వై’ కేటగిరీ భద్రత ఉండగా దాన్ని ‘జడ్’ కేటగిరికి పెంచింది.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ ముకుల్ రాయ్కు భద్రత పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
పశ్చిమ బెంగాల్లోని ఉత్తర కృష్ణగిరి నగర్ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి కౌషాణి ముఖర్జీని ఆయన ఎన్నికల్లో ఢీకొట్టబోతున్నారు.
294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్ శాసనసభకు 8 విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 27 నుంచి తొలి విడుత ఎన్నికలు ప్రారంభకానుండగా.. ఏప్రిల్ 29న చివరి విడత ముగియనున్నాయి. మే 2న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.