విష్వక్సేన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘అశోకవనంలో అర్జునకళ్యాణం’ శుక్రవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. విద్యాసాగర్ చింత దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఎస్వీసీసీ డిజిటల్ పతాకంపై బాపినీడు బి, సుధీర్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి విష్వక్సేన్ తల్లిగారైన దుర్గ క్లాప్ నిచ్చారు. నిర్మాతలు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘టైటిల్ మాదిరిగానే సినిమా కథలో కూడా కొత్తదనం ఉంటుంది. ప్రేమ, వినోదం, భావోద్వేగాల కలబోతగా మెప్పిస్తుంది. విష్వక్సేన్ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఆయన లుక్, పాత్ర చిత్రణ కొత్తశైలిలో కనిపిస్తుంది. త్వరలోనే సెట్స్మీదకు తీసుకెళ్తాం. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో తెలియజేస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి రచన: రవికిరణ్, సమర్పణ: బీవీఎస్ఎన్ ప్రసాద్, దర్శకత్వం: విద్యాసాగర్ చింత.