చిక్కడపల్లి, మే 13: ప్రముఖ సాహితీవేత్త, వరంగల్లోని శ్రీ విశ్వేశ్వర సంస్కృతాంధ్ర పీజీ కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ డాక్టర్ కండ్లకుంట వెంకటాచార్య (87) బుధవారం రాత్రి హైదరాబాద్లో కన్నుమూసినట్టు ప్రముఖ కవి, రచయిత, యువభారతి సంస్థ అధ్యక్షుడు ఆచార్య ఫణింద్ర తెలిపారు. వరంగల్ జిల్లా నెల్లికుదురు మండ లం రాజుల కొత్తపల్లిలో జన్మించిన వెంకటాచార్య.. కాకతీయ విశ్వవిద్యాలయం సిండికేట్ మెంబర్గా, చైర్మన్గా విశిష్ట సేవలందించారు. ‘ఆముక్త మాల్యదలో విశిష్టాద్వైత సిద్ధాంత ప్రకాశం’ అంశంపై పీహెచ్డీ సిద్ధాంత గ్రంథాన్ని రచించారు. ఆదర్శ గ్రామం- కిసాన్ సగార్, ధర్మపథం- సంస్కృత్యం కం, వైదిక అధ్యయనం, ఉపనిషత్తులకు తెలుగు వ్యాఖ్య ‘పరలోకం పునర్జన్మ’ తదితర రచనలు చేశారు. కేయూ దూర విద్యాకేంద్రానికి ఎంఏ పుస్తకాలు రచించారు. గురజాడ అప్పారావు స్మారక స్వర్ణపతకం, మాడపాటి హనుమంతరావు స్మారక పురస్కారాలు అందుకున్నారు. ఉపన్యాస రత్న బిరుదు పొందారు.