లక్నో : జాబ్ పేరుతో ఆశలు రేపి మహిళపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి ఉదంతం మీరట్ జిల్లాలో వెలుగుచూసింది. నిందితుడు నేరాన్ని కెమెరాలో రికార్డు చేయడంతో పాటు పోలీసులకు చెబితే క్లిప్ను వైరల్ చేస్తానని బాధితురాలిని బెదిరించాడు. మీరట్ జిల్లాలోని ఖర్కోడా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తనకు ఉద్యోగం ఇప్పిస్తానని ఓ మహిళ ఫిబ్రవరి 15న వ్యక్తి వద్దకు తీసుకువెళ్లిందని, అతడు తనను హోటల్కు తీసుకువెళ్లి కూల్డ్రింక్లో మత్తు మందు కలిపి ఆపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించారు.
ఈ దారుణాన్ని మొబైల్ ఫోన్లో రికార్డు చేసిన నిందితుడు పోలీసులకు చెబితే వీడియోను బహిర్గతం చేస్తానని బెదిరించాడని చెప్పారు. స్ధానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదని, ఫిర్యాదును స్వీకరించలేదని పేర్కొన్నారు. పోలీసుల తీరుతో విసుగుచెంది సీఎం పోర్టల్లో ఫిర్యాదు చేయడంతో అధికారుల్లో చలనం వచ్చింది. మరోవైపు ఈ విషయం తమ దృష్టికి రాలేదని స్ధానిక పోలీస్ అధికారి సంజయ్ శర్మ పేర్కొన్నారు. దర్యాప్తు అనంతరం నిందితులపై కఠిన చర్యలు చేపడతామని చెప్పారు.