విద్యానగర్, ఏప్రిల్ 11: 45 ఏండ్లు పైబడిన వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని కలెక్టర్ శశాంక సూచించారు. దగ్గు, జ్వరం, తలనొప్పి, ఒంటి నొప్పులతో బాధపడుతున్న వారు కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలన్నారు. నగరంలోని కోతిరాంపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, సప్తగిరికాలనీ కొవిడ్ పరీక్ష , వ్యాక్సినేషన్ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాస్క్ ధ రించాలని, భౌతిక దూరం పాటించాలని, కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. టీకా సురక్షితమని, నిశ్చింతగా వేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బల్దియా కమిషనర్ వల్లూరి క్రాం తి, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జీ సుజాత, కరీంనగర్ అర్బన్ తహసీల్దార్ సుధాకర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
మాస్కులు ధరించని వారికి జరిమానాల విధింపు