వికారాబాద్, మార్చి 26, (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాగా ఉన్న సమయంలో వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఫుట్బాల్ గ్రౌండ్లో టీఆర్ఎస్ పార్టీ 11వ ప్లీనరీని నిర్వహించారు. ఈ ప్లీనరీకి పార్టీ అధినేత కేసీఆర్, పార్టీ నేతలు కేటీఆర్, హరీశ్రావు, ఇతర పార్టీ పెద్దలతో పాటు అప్పటి జిల్లా అధ్యక్షుడు.. ప్రస్తుత టీఎస్ ఈడబ్ల్యూసీ కార్పొరేషన్ చైర్మన్ నాగేందర్గౌడ్ నేతృత్వంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన 12వేల మంది పార్టీ డెలిగేట్స్ ఇక్కడికి వచ్చారు. పార్టీకి సంబంధించిన సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ, ఎమ్మెల్యే లేని సమయంలో ఉద్యమ పార్టీ ఇక్కడ ప్లీనరీ నిర్వహించి సక్సెస్ చేశారు. 1978 ఆగస్టులో రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తే ఇక్కడి ప్రజలకు ఇబ్బందులు వస్తాయని జిల్లా కేంద్రంగా వికారాబాద్ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులకే జిల్లా ఉద్యమం ప్రారంభమైంది.1983-84 కాలంలోనే వికారాబాద్ జిల్లా సాధన సమితి పేరిట ఉద్యమం ప్రారంభమైంది.
అనేక మంది ముఖ్యమంత్రులకు వికారాబాద్ కేంద్రంగా రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేయాలని వినతి పత్రాలను అందించారు. అయితే అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమం కూడా మొదలైంది. వికారాబాద్కు జిల్లా కేంద్రం బదులు వికారాబాద్ ప్రత్యేక జిల్లా ఏర్పాటుకు ఉద్యమ సారథి కేసీఆర్ హామీ ఇవ్వడంతో జిల్లా నేతలు కేసీఆర్ వెంట నడిచారు. ఉద్యమ సమయంలో దారూర్ సభలో కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత వికారాబాద్ జిల్లాను ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో జిల్లా ప్రజలు ఆయన వెంట నడిచారు. అప్పటి వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఏ చంద్రశేఖర్, నాగేందర్ గౌడ్, ఇతర నేతలు టీఆర్ఎస్ పార్టీతో అడుగులు పడ్డాయి. రాష్ట్రం ఏర్పాటు తర్వాత కేసీఆర్ హామీ మేరకు వికారాబాద్ జిల్లాను ఏర్పాటు చేశారు.
ఇవీ కూడా చదవండి…
కరోనాతో ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు కన్నుమూత
ప్రపంచ వ్యాప్తంగా టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం
మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం.. కొత్తగా 48,700 కేసులు