ముంబై: వాంఖడే మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మెన్ ధనాధన్ బ్యాటింగ్తో అలరిస్తున్నారు. కోల్కతా నైట్రైడర్స్తో మ్యాచ్లో ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్ చెలరేగడంతో పవర్ప్లే ఆఖరికి చెన్నై 54/0తో నిలిచింది. కమిన్స్ వేసిన రెండో ఓవర్లో డుప్లెసిస్ ఫోర్ కొట్టగా..గైక్వా డ్ 4, 6 బాదడంతో 15 పరుగులు వచ్చాయి. వీళ్లిద్దరూ ప్రతీ ఓవర్లో కనీసం ఒక బౌండరీ బాదుతూ స్కోరును పరుగెత్తిస్తున్నారు. 7 ఓవర్లకు చెన్నై వికెట్ నష్టపోకుండా 60 పరుగులు చేసింది. గైక్వాడ్(28), డుప్లెసిస్(31) భారీ భాగస్వామ్యం దిశగా సాగుతున్నారు. కుదురుకున్న ఈ జోడీని విడదీయాలని మోర్గాన్సేన ప్రయత్నిస్తోంది.