హైదరాబాద్: జానారెడ్డి ఎందుకు ఓడిపోయారో అందరికీ తెలుసునని మాజీ మంత్రి, ఏపీ టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో జానా గెలవడని తాను ముందే చెప్పానన్నారు. తెలంగాణ శాసన సభా సమావేశాల సందర్భంగా ఆయన అసెంబ్లీకి వచ్చారు. సీఎల్పీలో పాత మిత్రులను కలిశారు. ప్రస్తుతం రాజకీయాలు బాగాలేవు, సమాజం కూడా బాగోలేదని చెప్పారు.
ఏపీ కన్నా.. తెలంగాణలో రాజకీయాలు బాగున్నాయని తెలిపారు. తాను ఆంధ్రప్రదేశ్ని వదిలేసి తెలంగాణకు వస్తానని వెల్లడించారు. తెలంగాణను వదిలిపెట్టడంతో చాలా నష్టపోయానని చెప్పారు. హుజూరాబాద్ ఉపఎన్నిక గురించి తనకు తెలియదన్నారు. కాగా, అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం కేసీఆర్ను దివాకర్ రెడ్డి కలిశారు.