కొత్తపల్లి, జూన్ 5 : కార్మికులను, కార్మిక సంఘాలను ఓర్వలేని చరిత్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్దని, ఆయన కార్మికలోకానికి చేసింది శూన్యమని తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు కార్మిక సంఘం (టీఆర్వీకేఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడూరి ప్రకాశ్ విమర్శించారు. శనివారం కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 2014లో ఈటలను కలిస్తే పట్టించుకోలేదని గుర్తుచేశారు. అనంతరం కొప్పుల ఈశ్వర్ను కలిసి తమ గోడును వెల్లబోసుకోగా రెండు దఫాలుగా సీఎం వద్దకు తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషిచేశారన్నారు. 2004లోనే ఉద్యమనేత కేసీఆర్ అనుమతితో యూనియన్ను ఏర్పాటు చేసుకొన్నట్టు స్పష్టంచేశారు. విద్యుత్తు సంస్థలో పెద్ద సంఘాలుగా చెప్పుకొనే యూనియన్లు గతంలో 27.5 శాతం పీఆర్సీకి అగ్రిమెంట్ చేసుకుంటే.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత సహకారంతో పీఆర్సీని 30 శాతానికి సాధించినట్లు చెప్పారు. చరిత్రలోఎన్నడూ లేని విధంగా సీఎం కేసీఆర్ 35 శాతం పే స్కేలు అమలుచేయించారని, ఇందులో ఎమ్మెల్సీ కవిత సహకారం మరువలేనిదని గుర్తచేశారు. టీఆర్వీకేఎస్ ఎప్పుడూ కేసీఆర్ వెంటే ఉంటుందని, హుజూరాబాద్లో ఉపఎన్నిక వచ్చినా వారి వెంటే ఉండి విజయానికి పనిచేస్తామని స్పష్టంచేశారు. సమావేశంలో టీఆర్వీకేఎస్ కంపెనీ అధ్యక్షుడు జీ రాందాస్, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ రాజలింగం తదితరులు పాల్గొన్నారు.