హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్ శోభ ఆదేశించారు. తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ (దూలపల్లి) నేతృత్వంలో అటవీ భూముల రక్షణ, అన్యాక్రాంతమైన అటవీ భూముల స్వాధీనం విధానాలపై అన్ని జిల్లాల అధికారులతో శనివారం ఆమె వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆక్రమణలకు గురైన అటవీ భూముల తిరిగి స్వాధీనంలో చట్టప్రకారం వ్యవహరించాలని సూచించారు. అటవీ నేరాల్లో అటవీ అధికారుల ప్రమేయం ఉన్నట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు..