పాల్వంచ, ఏప్రిల్ 4: కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటుకు ఆదివారం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని గుడిపాడు, బంగారుజాల ప్రాంతంలోని భూముల్లో సర్వే నిర్వహించారు. గుడిపాడు ప్రాంతంలోని సర్వేనంబర్ 990లోని ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఈ ప్రాంతంలో కలియదిరిగారు. మరో మూడు రోజుల పాటు ఇక్కడే ఉండి సర్వే నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. గతంలో ఒకసారి సర్వే చేశామని, విమానాశ్రయ నిర్మాణానికి అనువుగా ఉందా లేదా అని సర్వే చేసి ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు చెప్పారు. ఆర్అండ్బీ ఈఈ బీమ్లా ఈ బృందానికి నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఏఏఐ అధికారుల బృందంలో ఏఎం కె.కరివోలి, ఎస్హెచ్ గౌరవ్ కుమార్ ఉపాధ్యాయ, ఎనలసిస్టు కె.అభిరాం, తహసీల్దార్ స్వామి, ఆర్ఐ రామయ్య, సర్వేయర్ నాగరాజు తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చూడండి..
పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు మరింత తగ్గుతాయి: ధర్మేంద్ర ప్రధాన్
స్టాండప్ ఇండియా పథకానికి రూ.25,586 కోట్లు మంజూరు