ఫొటోగ్రాఫర్, జనగామ;విదేశీ విహంగాలు.. సైబీరియన్ పక్షులు. పొడవాటి ముక్కు.. భారీ రెక్కలు. అందంగా, ఆకర్షణీయంగా కనిపించే ఈ కొంగలు జనగామ జిల్లాలో సందడి చేస్తున్నాయి. ప్రతి సంవత్సరం ఈ పక్షులు దేవరుప్పుల మండలం చిన్నమడూర్కు వచ్చి చెట్లపై విడిది చేస్తాయి. జనవరి మాసంలో వచ్చి జూన్ చివరి నాటికి వెళ్లిపోతాయి. ఐదునెలలపాటు గ్రామ చెరువులు, కుంటల్లో కలియదిరుగుతూ చేపలను తింటూ గడుపుతాయి. సంతానోత్పత్తి తర్వాత తమ పిల్లలతో కలిసి తిరుగుముఖం పడుతాయి. వర్షాలు కురుస్తుండటంతో పిల్ల పక్షులు ఎగరలేక పోవడంతో గూడు పైనే ఉండిపోయాయి.