మోత్కూరు, సెప్టెంబర్ 17: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలోని బిక్కేరు వాగులో పాదముద్రలు బయటపడ్డాయి. ఇటీవల కురిసిన వర్షాలకు బిక్కేరు వాగు ఉధృతంగా ప్రవహించింది. వాగులోని ఇసుక మేటలు వరద తాకిడికి కిందికి తరలిపోవడంతో పాద ముద్రలు బయటపడ్డాయి. పాదముద్రలు, చందమామ ఆకారంలో ఉన్న గుర్తులను చూసి స్థానికులు పూజలు చేశారు. మోత్కూరు పట్టణంలోని పురాతన ఇంగీసమ్మ దేవాలయం నుంచి సీతారాములు జీడికల్ గ్రామంలోని దేవాలయానికి వెళ్లి అక్కడ కొలువుదీరారని చెప్తుంటారు.