హైదరాబాద్ : అర్హులైన ప్రతి ఒక్కరికి ఆహార భద్రత కార్డులను అందజేసే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెపూడి గాంధీ పేర్కొన్నారు. బుధవారం ఆయన చందానగర్ డివిజన్ పరిధిలోని అంబేద్కర్ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఆహార భద్రత కార్డులను డివిజన్ కార్పొరేటర్ మంజులతో కలిసి లబ్ధిదారులకు కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఆహార భద్రత కార్డులను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఆ దిశగా పంపిణీ ప్రక్రియను వేగవంతంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
పేద, మధ్య తరగతి ప్రజల ఆకలి తీర్చే దిశగా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి అనుమతులు జారీ చేసిందన్నారు. అర్హులకు అందించే ప్రక్రియ సైతం రాష్ట్ర వ్యాప్తంగా శరవేగంగా కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు రవీందర్రావు, లక్ష్మీనారాయణ, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథరెడ్డి, నాయకులు లక్ష్మారెడ్డి, గోవర్ధన్రెడ్డి, ప్రీతమ్, వెంకటేశ్, శ్రీకాంత్రెడ్డి, నాగరాజు, రాజశేఖర్రెడ్డి, ప్రవీణ్, దాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
భర్త వద్దంటే పనికి వెళ్లాడని భార్య ఆత్మహత్య
ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అత్యాచారయత్నం కేసు
దారుణం : రైల్వే ట్రాక్పై యువతి మృతదేహం
Road accident |బొలెరో వాహనం బోల్తా..పది మందికి గాయాలు