హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): దవాఖానల్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు, వారిని చూసుకొనేందుకు వచ్చిన కుటుంబసభ్యులకు కేసీఆర్ సేవాసమితి, గ్రీన్ ఇండియా చాలెంజ్ ఆధ్వర్యంలో మంగళవారం అన్నదానం చేశారు. లాక్డౌన్ వల్ల రోగుల బంధువులు అన్నం లేక ఇబ్బందులు పడకూడదని భావించి హైదరాబాద్లోని నిలోఫర్, కోఠిలోని ప్రసూతి దవాఖాన, నిమ్స్, ఫీవర్ తదితర దవాఖానల్లో బాధితులకు పౌష్టికాహారాన్ని అందజేశారు. కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి, తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజీవ్సాగర్ తదితరులు పాల్గొన్నారు.