కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలి
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న,డీడీసీ చైర్మన్ లోక భూమారెడ్డి
హుస్సెన్ హుస్సెన్ ఆలయంలో ప్రత్యేక పూజలు
అభివృద్ధి పనుల పరిశీలన
తలమడుగు, మే15 : కరోనా వ్యాప్తి నేపథ్యంలోప్రజలు బయటకు రావద్దని, నిబంధనలు పాటించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామ న్న,డీడీసీ చైర్మన్ లోక భూమారెడ్డి సూచించారు. మండలంలోని రుయ్యాడి గ్రామంలోని హస్సెన్ హుస్సెన్ ఆలయంలో శనివారం వారు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఆవరణలో రూ. 70 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న, లోక భూమారెడ్డి మాట్లాడుతూ ఆలయ అభివృద్ది మరింత కృషి చేస్తామన్నారు. కరోనాతో దేశం అతలాకుతలం అవుతున్నదని, ఈ సమయంలో ప్రజలు కొవిడ్ నియమాలు పాటించాలని సూచించారు. రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు బోజారెడ్డి, సర్పంచ్ పోతారెడ్డి, గోక భూమారెడ్డిలు పాల్గొన్నారు.
బాలల సంరక్షణకు ప్రత్యేక చర్యలు
ఎదులాపురం, మే 15 : కొవిడ్ బారినపడి తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ బాలబాలికల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్, తాత్కాలింగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే జోగు రామన్న మాట్లాడుతూ తల్లిదండ్రులు కొవిడ్ బారిన పడడంతో ఇబ్బందులు పడే పిల్లలు అలనా పాలన చూసుకుంటామని చెప్పారు. బాలికల కోసం జిల్లా కేంద్రంలోని బాలసదనం, బాలుర కోసం ఉట్నూర్ ఏమ్ ఫర్ సేవలో ఆశ్ర యం కల్పిస్తామని చెప్పారు. 040 2373 3665 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయాలన్నారు. హెల్ప్లైన్ కరపత్రాన్ని విడుదల చేశారు. డీసీపీవో రాజేంద్రప్రసాద్, సీడబ్ల్యూసీ చైర్మన్ వెంకటస్వామి, సభ్యులు సమీర్ ఉల్లఖాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టుప్రహ్లాద్, రైతు బంధు సమితి అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి పాల్గొన్నారు.