హైదరాబాద్, మే 08, (నమస్తే తెలంగాణ): అసలే కరోనా కాలం.. అంతా ఆన్లైన్ మయం. పిల్లల పాఠాల నుంచి టైంపాస్ గేమ్స్ వరకు గంటల తరబడి పిల్లలు ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్లకే అతుక్కుపోతున్నారు. పిల్లలు ఇంటర్నెట్లో ఏం చేస్తున్నారు.. ఏయే సైట్లు చూస్తున్నారు.. అనేదానిపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాలని కేంద్ర హోంశాఖ సైబర్ క్రైం పోర్టల్ సైబర్ దోస్త్ వెల్లడించింది. ఇందుకు కొన్ని సూచనలు చేసింది.