హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ఆలోచనల కు అనుగుణంగా రైతులు ప్రత్యామ్నా య పంటల సాగుపై దృష్టి సారించాలని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వరికి బదులు పత్తి, కంది, ఆయిల్పామ్, ఉద్యాన పంటలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇదే తీరుగా ధాన్యం పండిస్తే భవిష్యత్లో కొనుగోళ్లు కష్టమవుతాయన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులు కష్టపడొద్దనేదే సీఎం కేసీఆర్ తపన అని పేర్కొన్నారు. సీఎం ముందు చూపు వల్ల రాష్ట్రం వ్యవసాయ రంగం లో దేశంలోనే మేటిగా నిలిచిందని తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి అయిందని వెల్లడించారు.