హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): కరోనా కష్టకాలంలో ప్రజలకు విశేష సేవలందించిన తెలంగాణ నర్సు అరుణకుమారికి కేంద్రం ఫ్లారెన్స్ నైటింగేల్ అవార్డును అందజేయనున్నది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ బుధవారం ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. అరుణకుమారితోపాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 53 మంది నర్సులు ఈ అవార్డులను అందుకోనున్నారు. కొవిడ్ నేపథ్యంలో ఈ అవార్డులను వర్చువల్గా అందజేయనున్నట్టు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ప్రకటించింది.