జోగులాంబ గద్వాల (అయిజ) : కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర ప్రాజెక్టుకు వరద ముంచెత్తుతోంది. శనివారం ఈ ప్రాజెక్టుకు 1,02,048 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. అవుట్ ఫ్లో 5,214 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రస్తుతం డ్యాంలో 71.721 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. 1624.42 అడుగుల మేర నీటి మట్టం ఉన్నట్లు ప్రాజెక్టు సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు. ఎగువన భారీగా కురుస్తున్న వర్షాలకు మరింత వరద తుంగభద్రకు వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.