సూర్యాపేట : రాష్ర్ట వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అన్ని ప్రాజెక్టులకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. సూర్యాపేట జిల్లాలోని మూసీ ప్రాజెక్టు నిండు కుండలా తొణికిసలాడుతోంది. భారీగా వస్తున్న వరదతో మూసీ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 642.5 ఫీట్లు కాగా, ప్రస్తుత నీటి మట్టం 645 ఫీట్లుగా ఉంది. దీంతో మొత్తం నాలుగు గేట్ల ( 2,4,6,8) ద్వారా 2,600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.