నిజామాబాద్ : గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి 12,658 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నదని ఏఈఈ వంశీ తెలిపారు. దీంతో ప్రాజెక్ట్ నీటిమట్టం స్వల్పంగా పెరుగుతున్నది. ఈ సీజన్లో ప్రాజెక్ట్లోకి ఇప్పటి వరకు 56 టీఎంసీల నీరు వచ్చి చేరిందన్నారు.
కాకతీయ కాలువకు 50, గుత్ప, అలీ సాగర్ ఎత్తి పోతల పథకాలకు 630 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుందన్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా సోమవారం సాయంత్రానికి 1086.40 అడుగుల (71.310 టీఎంసీలు) నీటి నిల్వ ఉందని ఏఈఈ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
రేపటి నుంచి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
దళిత బంధు చరిత్రలో నిలిచిపోతుంది : ఎల్. రమణ
చరిత్రలో ఈరోజు.. 14 బ్యాంకులను జాతీయం చేసిన ఇందిరాగాంధీ
అక్రమంగా పట్టా చేసుకున్నాడని.. పంట పొలంలోనే కట్టేశారు
ఇల్లందకుంటలో దళితుల భారీ ర్యాలీ