హైదరాబాద్ : అసెంబ్లీలో సీనియర్ ఫొటోగ్రాఫర్ సలీం మృతి పట్ల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సలీం భాయ్ మరణం నన్ను వ్యక్తిగతంగా కలిచివేసిందన్నారు. ఎప్పుడూ ఎదురైన ఆప్యాయంగా ‘ఏక్ ఫొటో సాబ్’ అంటూ పలకరింపుతో ఆయన తీసే ఫొటోల తీరు గుర్తుకు వస్తే మంచి మనిషిని కోల్పోయామనే ఆవేదన కలుగుతుందని విచారం వ్యక్తం చేశారు.
ఆయన ఇకలేరు అనే విషయాన్ని నమ్మలేకపోతున్న. సలీమ్ భాయ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగంతుణ్ణి ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
భార్యను వేట కొడవలితో నరికి చంపిన భర్త
బైక్ను ఢీకొట్టిన లారీ..ఆర్ఎస్ఐ మృతి
నాగార్జునసాగర్ ఎన్నికల ఫలితాల లైఫ్ అప్డేట్స్