హైదరాబాద్: ఎగువన భారీ వర్షాల కారణంగా హైదరాబాద్లోని హిమాయత్ సాగర్కు వరద ప్రవాహం పోటెత్తుతున్నది. పెద్దఎత్తున నీరు వచ్చిచేరుతుండటంతో జలాశయం నిండుకుండలా మారింది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో మూసీ పరీవాహక ప్రాంతాల్లో మొదటి హెచ్చరిక జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సాగర్ గేట్లు ఎత్తితే వరదనీరు మూసీ నదిలో వచ్చి చేరుతుంది. హిమాయత్ సాగర్లోకి ప్రస్తుతం 1666 క్యూసెక్కుల నీరు వస్తున్నది. సాగర్ గరిష్ట నీటిమట్టం 1763.50 అడుగులుకాగా, ప్రస్తుతం 1762.60 అడుగులకు చేరింది. జంట జలాశయాల్లో మరొకటైన ఉస్మాన్సాగర్లో ప్రస్తుతం 1784.60 అడుగు వద్ద నీరు ఉన్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు.