చెన్నై: ఐపీఎల్ అంటేనే వెలుగు జిలుగులు, తారల తళుకుబెళుకులు, కళ్లు మిరిమిట్లు గొలిపే ఓపెనింగ్ సెర్మనీ. అయితే గత కొన్నేళ్లుగా ఈ ఓపెనింగ్ సెర్మనీ చూసే అవకాశం అభిమానులకు లేకుండా పోయింది. ముఖ్యంగా సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ వచ్చిన తర్వాత కళ్లు చెదిరే ఓపెనింగ్ సెర్మనీలు ఐపీఎల్లో కనిపించలేదు. ఇక గతేడాది కరోనా మహమ్మారి కారణంగా యూఏఈలోనూ ఆరంభ వేడుకలు నిర్వహించలేదు.
మరి ఈ ఏడాది ఉంటుందా?
ఈ పరిస్థితుల్లో అసలు ఈ ఏడాది ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ ఉంటుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఏడాది కూడా అలాంటిదేమీ లేకుండా సింపుల్గా టోర్నీని ప్రారంభించేయనున్నారు. కొవిడ్ కేసులు పెరిగిపోతుండటం, అభిమానులు లేకుండానే టోర్నీ నిర్వహిస్తుండటంతో ఎలాంటి వెలుగు జిలుగులు కనిపించబోవడం లేదు. అయితే ఈ టోర్నీ ఓపెనింగ్ సెర్మనీకి మాత్రం కొందరు స్పెషల్ గెస్ట్లు వస్తున్నారు. తొలిసారి దివ్యాంగ క్రికెట్ కౌన్సిల్కు చెందిన సభ్యులను ప్రత్యేకంగా టోర్నీ ఆరంభోత్సవానికి పిలిచారు. ఈ విషయాన్ని డిఫ్రెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (డీసీసీఐ) ట్వీట్ చేయగా.. దానిని బీసీసీఐ సెక్రటరీ జే షా రీట్వీట్ చేశారు. ఇక ఈ టోర్నీని ప్రత్యక్షంగా కవర్ చేయడానికి మీడియాకు కూడా అనుమతి ఇవ్వలేదు.
ఇవి కూడా చదవండి
ముంబై vs బెంగళూరు.. తుది జట్లు ఇవే!
భయం లేదు.. రైళ్లు కొనసాగుతాయి!
యూఎస్ నేవీ దుస్సాహసం.. భారత జలాల్లో ఆపరేషన్
మహమ్మారి వెంటాడినా పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు!