హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): కేసుల దర్యాప్తులో ఉత్తమ పనితీరు కనబర్చిన ఐదుగురు తెలంగాణ పోలీస్ అధికారులకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. కేంద్ర హోంమంత్రి మెడల్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్-2021కు దేశవ్యాప్తంగా 152 మంది ఎంపికైనట్టు కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. ఇందులో తెలంగాణ నుంచి భువనగిరి ఏసీపీ నాయిని భుజంగరావు, మల్కాజిగిరి ఏసీపీ ఎన్ శ్యామ్ప్రసాద్రావు, ఏసీబీ డీఎస్పీ అలిగాటి మధుసూదన్, సీఐడీ ఏసీపీ జీ శ్యామ్సుందర్ ఉన్నారు. వీరితోపాటు కంచన్బాగ్ పోలీస్స్టేషన్ అడ్మిన్ ఎస్సై నేనావత్ నగేశ్ సైతం జాతీయస్థాయిలో ఉత్తమ పురస్కారానికి ఎంపికయ్యారు. అత్యధికంగా సీబీఐ నుంచి 15 మంది, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి 11 మంది చొప్పున పురస్కారాలకు ఎంపికయ్యారు