వరంగల్ రూరల్ : ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్లు సరిపడా లారీలను సమకూర్చకపోవటం వల్లే ధాన్యం రవాణాకు అంతరాయం కలుగుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. శాయంపేట మండలంలో యాసంగి దాన్యం కొనుగోలు, రవాణాపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. . కొందరు అధికారుల నిర్లక్ష్యంతోనే కొనుగోలు సాఫీగా జరగక పోవడం వల్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పెరిగి పోతున్నాయని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
అలాగే ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాల నుంచి దాన్యం రవాణా చేయని ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్ల రవాణా కాంట్రాక్టును రద్దు చేస్తామని హెచ్చరించారు. అంతకుముందు మండలంలోని వివిధ గ్రామాల్లో దాన్యం కొనుగోలు కేంద్రాలను జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతితో కలిసి ఎమ్మెల్యే సందర్శించారు.
ఇవి కూడా చదవండి..
నెక్కొండ పీహెచ్సీని సందర్శించిన ఎమ్మెల్యే పెద్ది
యాదాద్రిలో ప్రారంభమైన నృసింహుడి జయంతి ఉత్సవాలు
సెప్టెంబర్లో మిగిలిన ఐపీఎల్ మ్యాచులు..?