నల్లగొండ: జిల్లాలోని కట్టంగూరు సమీపంలో రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఐదురు మృతిచెందారు. కట్టంగూరు మండలం ముత్యాలమ్మగూడెం శివారులో ఈ ప్రమాదాలు జరిగాయి. ముత్యాలమ్మగూడెం వద్ద హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న కారు కంటైనర్ను ఢీకొట్టింది. అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.
మరో ఘటనలో ఆగిఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈప్రమాదాల నేపథ్యంలో జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వాహనాలను తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు.