నల్లగొండ : చేపల పెంపకం ఎంతో లాభదాయకంగా ఉంటుందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సంప్రదాయపంటలకు స్వస్తి పలకాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వం లోని తెలంగాణా ప్రభుత్వం చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తుందని ఆయన తెలిపారు. జిల్లాలోని నార్కట్పల్లి మండల పరిధిలోని అమ్మనబోలు గ్రామంలో బద్దం రాంరెడ్డి అనే రైతు కిందటి సంవత్సరం నుంచి తనకున్న పది ఎకరాల వ్యవసాయ భూమిలో పెంచుతున్న చేపల పెంపకాన్ని మంత్రి గురువారం స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలసి సందర్శించారు.
అనంతరం ఆయన స్థానిక రైతులతో సంప్రదాయ పంటలపై ఇష్టా గోష్టిగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. కిందటి యేడాది వానాకాలం నుంచి ఇప్పటి వరకు చేపల పెంపకాన్ని కొనసాగిస్తున్న రైతు రామిరెడ్డి ని అభినందించారు. చేపల పెంపకం పై రాంరెడ్డి ఎదుర్కొన్న సాధక బాధకాలను అక్కడి రైతులకు వివరించిన మంత్రి జగదీష్ రెడ్డి వ్యవసాయంలో విపలవాత్మకమైన మార్పులు అవసరమన్నారు.
యావత్ రైతాంగం ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలన్నారు. వేరుశనగ,కందులు, పెసర, మినుములతో పాటు చేపల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. తద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడించవచ్చన్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనాతో మేడారం పూజారి సమ్మారావు మృతి
ఆకతాయిలను ఐసోలేషన్కు పంపించిన పోలీసులు
అడవి శ్రీరాంపూర్లో కరోనాతో భార్యాభర్తలు మృతి
రైతులకు పనిముట్లను అందజేసిన మంత్రి అల్లోల
లాక్ డౌన్ కేసులు 11,746 : ఎస్పీ వెంకటేశ్వర్లు
మేడారం పూజారి మృతిపట్ల మంత్రి సత్యవతి సంతాపం