హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 8న రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్నారు. అదేరోజు మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, హరీశ్రావు సిద్దిపేట జిల్లాలోని రంగనాయక్సాగర్, కోమటిచెరువులో చేపపిల్లలను విడుదల చేసి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇతర జిల్లాల్లో ప్రజా ప్రతినిధుల సమక్షంలో చేపపిల్లల పంపిణీ జరుగనున్నది. 5వ విడతలో భాగంగా రాష్ట్రంలోని 30 వేల చెరువులు, రిజర్వాయర్లు, ఇతర నీటివనరుల్లో 80 కోట్ల చేపపిల్లలను విడుదల చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.93.16 కోట్లను ఖర్చు చేయనున్నది. రూ.25 కోట్లతో 10 కోట్ల రొయ్యపిల్లలను కూడా విడుదల చేయనున్నారు.