హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ)/దహెగాం/ నేరడిగొండ: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఈ) సెట్లో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాల యం (కేజీబీవీ) విద్యార్థి గడీల అనోద స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించింది. తెలుగు మీడియంలో 100 మార్కులకుగాను 68 మార్కులు సాధించి మొదటి ర్యాంకును సొంతం చేసుకున్నట్టు పాఠశాల విద్యాశాఖ గురువా రం తెలిపింది. అలాగే ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రానికి చెందిన తాళ్ల ప్రియాంక రాష్ట్రస్థాయిలో పదో ర్యాంకు సాధించింది.